Friday, November 21, 2025
కాగితం అపురూపం!
మా అమ్మ కరేడులో పుట్టి పెరిగింది.అది సముద్రతీర ప్రాంతం,బకింగ్ హామ్ కెనాలుదగ్గర.అమ్మ చిన్నప్పుడు ఇసుకలో అక్షరాలు దిద్దుతూ చదువుకుంది.అప్పట్లో అమ్మ ఏదో పోటీలో గెలిస్తే ఒక తెల్ల పేపరు బహుమానంగా ఇచ్చారట!అమ్మ గొప్పగా మాకు చెబుతుండేది.అమ్మ రెండో ప్రపంచ యుద్ధం కూడా చూసింది.రాత్రుళ్ళు వీథి దీపాలు వెలుగుతాయి కదా!ఆ వెలుతురు కనిపిస్తే పైనుంచి,ఊరు ఉందని తెలుస్తుంది కదా!బాంబులు వేస్తారేమో అని భయపడేవాళ్ళట.అందుకని వెలుతురు పైకి కనిపించకుండా ముళ్ళకంపలు కప్పేవాళ్ళట ఊర్లోవాళ్ళు.
అప్పట్లో కాగితం అంత అపురూపం!సగటు మానవుడు విరివిగా వాడగలిగే పరిస్థితి ఉండేది కాదేమో!అదీ కాకుండా అక్షరాస్యత కూడా అంతంత మాత్రంగానే ఉండేదేమో!ఊరంతటికీ చదవటం,వ్రాయటం తెలిసిన వాళ్ళు ఒక్కరోఇద్దరో ఉండేవాళ్ళు.స్వతహాగా కాగితం చెట్లనుంచి తయారు చేస్తారు కాబట్టి పర్యావరణ సమస్య కూడా.
అందుకనే ఇప్పుడు అంతా పేపర్ లెస్ లావాదేవీలు,మనీ ట్రాన్సాక్షన్స్ కు ఊతం ఇస్తున్నారు.ఒక రకంగా మంచిదే కదా!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment