Monday, April 27, 2020

యాభైలో ఇరవై అయిదు పోతే ఎంత?

50-25=? ఇదినేను రెండో తరగతిలో వుండగా సంవత్సర పరీక్షలకు అడిగిన ప్రశ్న.పరీక్ష హాలులో దీనికే ఎక్కువ సమయం తీసుకున్నాను.మల్లగుల్లాలు పడ్డాను.జవాబు 25,35,30తేల్చుకోలేక పోయాను.చివి ఆఖరికి ధైర్యం చేసి,సక్సెస్ ఫుల్ గా 35 అని తప్పు జవాబు రాశాను.ఇంటికి వచ్చిన తర్వాత అది తప్పని,సరి అయిన జవాబు25 అని తెలిసింది.నాకు మొదటి నుంచి అదే సరైన జవాబు అని అనుమానం.కానీ ప్రశ్నలోనే జవాబు ఇవ్వరు అని నమ్మకం.అందుకని అది జవాబు గా రాయలేదు.సున్నాలో అయిదు పోతే సున్నా రాదు కాబట్టి 30 వ్రాయలేదు.ఇక మిగిలింది 35 కాబట్టి అది వ్రాశాను.మొత్తానికి తప్పు రాశాను.
ఇదే మనం ఎప్పుడూ చేసే తప్పు.కళ్ళ ముందే పరిష్కారం వున్నా గ్రహించలేము.శాస్త్రీయపరమైన విశ్లేషణ పూర్తిగా చెయ్యము.అంతా దైవాధీనంగా చేస్తాము.100%నిష్టగా ఏ పని చెయ్యము.పదిలో అయిదు పోతే అయిదు అని వ్రాసినదానిని,పక్కకు ఒకటి ఇచ్చేస్తే ఇక నాలుగే కదా మిగిలేది అని నిదానంగా ఆలోచించలేకపోయాను.అన్నిటికీ తొందరే,నిదానంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించే కుదురు వుండదు.మనకు ఫలితం మంచిగా దక్కాలంటే మనం చేసే ప్రతి పనిని నియమ నిష్టలతో,నిబద్ధతలతో చెయ్యాలి.

No comments: