Tuesday, October 15, 2024
జిహ్వచాపల్యం…..అవసరమా?
ఇంట్లో అమ్మలు,అమ్మమ్మలు,అత్తలు,నానమ్మలు వుండి పూట పూటకు రుచులు రుచులుగా చేసి పెడుతుంటే,ప్రతి ఒక్కరికీ జిహ్వ చాపల్యం ఉండి తీరాల్సిందే.కానీ ఇప్పుడు పరిస్థితులు అలాగ లేవు చాలా ఇండ్లలో.అప్పుడు పరిస్థితి ఏంది?క్షణాల్లో పొద్దున టిఫిన్ అయిపోవాలి,కడుపులోకి కూడా పోవాలి.మధ్యాహ్నం లంచ్ కి గబ గబా ఏదో ఒకటి కుక్కుకుని,మళ్ళీ సీట్ లోకి వెళ్లి పని చూసుకోవాలి.ఈ పరిస్థితులలో రుచులకు చోటు ఏది?మన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్నారు.మంచి పరిణామం.నథింగ్ వైట్ అనే ఉద్యమం బాగా నడుస్తుంది.అంటే పాలు,చక్కెర,పిండి పదార్థాలు,బియ్యం లాంటివి వద్దు అని.ఇంకో వర్గం నూనెలు వద్దు,కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే కష్టం అంటుంది.ఇవన్నీ తప్పని కాదు కానీ మరీ భయపడి ఎండుకు పోకూడదు కదా.
ఇప్పుడు చద్దెన్నాలు తినేవాళ్లు లేరు.ఇడ్లీ దోసెలు వీకెండ్ కి జరిగిపోయాయి చాలా మంది ఇండ్లలో.రాగి జావ,గ్రిట్స్,ఓట్స్,ఫ్రూట్స్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్.
రుచులు రుచులుగా చేస్తే ఒకటి తినాల్సింది నాలుగు తింటాము.ఉప్పు వేస్తే బీపీ అంటాము.చక్కెర వేస్తే షుగర్ అంటాం.కారం వేస్తే కడుపులో మంట అంటాము.అయితే ఇప్పుడు ఎలా?
అందుకనే ప్రతిదీ చిన్నప్పటి నుంచీ మితంగా తీసుకుంటే, చాలా ఆరోగ్య సమస్యలు నుండి బయట పడవచ్చు.ఇంకో రెండు ముద్దలు తింటే కడుపు నిండుతుంది అంటే,ఇప్పుడే ఆపెయ్యాలి.చిన్నప్పుడు మా బాబు(నాన్న)చెప్పేవాడు.కడుపులో సగం అన్నం ఉండాలి.పావు భాగం నీళ్లు ఉండాలి.మిగిలిన పావు భాగం కాళీగా ఉండాలి.రుచిగా తినకూడదు అని కాదుకానీ,ఆరోగ్యం పట్ల కూడా అవగాహన పెంచుకుంటే బాగుంటుందిమనందరమూ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment