Saturday, October 19, 2024

చద్దెన్నము తిన్న ఇల్లాలు

చద్దెన్నము తిన్న ఇల్లాలికి మొగుడు ఆకలి తెలియదంటారు.మొగుడి ఆకలి తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా బిడ్డల ఆకలి తెలుస్తుంది.శబరి ఏమీ చేసింది?తను రాముడికి సమర్పించాలి అనుకున్న పళ్ళు అన్నీ మంచిగా ఉన్నాయా లేదా అని కొరికి చూసింది.ఇంట్లో మన అమ్మ కూడా అలాగే అన్ని చూసుకుని చేస్తుంది.ఇంత పనులు చెయ్యాలంటే శక్తి ఉండాలి కదా ఒంట్లో.మరి ఏమీ తినకపోతే,పొద్దున లేచి ఒంట్లోకి శక్తి ఎట్లా వస్తుంది?నేను మా పిల్లలకు కూడా అదే చెప్తాను.మొదట మీరు తినండి.తరువాత ఇంట్లో వాళ్ళకు పెట్టండి అని.ఇట్లా చేస్తే రెండు లాభాలు మనకు.ఉప్పులు కారాలు సరిగ్గా పడ్డాయో లేదో తెలుస్తుంది.రెండోది ఏంటంటే,ఇంట్లో వాళ్లకి మంచిగా,ఓపికగా,సంతోషంగా పెట్టగలతాము భోజనం.లేకపోతే నీరసానికి,ఆకలికి చేసే పని మీద సరైన ధ్యాస ఉండదు.ఊరికినే ఇంట్లో వాళ్ళను విసుక్కుంటూ,కసురుకుంటూ వుంటాము.లేకపోతే చెయ్యలేక కళ్ళలో నీళ్ళు కుక్కుకుంటూ వుంటాము.ఇవన్నీ అంత అవసరమా?మనము ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంట్లో వాళ్ళ బాగోగులు పట్టించుకోగలము.కాబట్టి మంచిగా పొద్దున అల్పాహారం తీసుకోండి.ఇంట్లో చిన్న బిడ్డలు ఉంటే వాళ్ళకు అన్నాలు పెట్టడానికి చాలా ఓపిక,సహనం కావాలి.ఆకలి పైన అవి పక్కకు వెళ్ళిపోతాయి.విసుకు,కోపం వస్తుంటాయి.కాబట్టి ఒక ముద్ద మీరు ముందు తిని,తరువాత వాళ్ళకు పెట్టండి.అయ్యో!ఇంట్లో వాళ్లందరూ తినకుండా మనమెట్లా తింటాము అని ఆలోచించవద్దు.అందరి మంచికోసమే నేను చెప్పేది.

No comments: